Webdunia - Bharat's app for daily news and videos

Install App

25న శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (18:50 IST)
ఈ నెల 25వ తేదీ మంగళవారం అమవాస్యతో పాటు సూర్యగ్రహణం సంభవించనుంది. దీంతో శ్రీవారి ఆలయాన్ని మూసి వేస్తారు. ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సమయంలో అన్ని రకాల దర్శనాలను రద్దు చేశారు. లడ్డూల విక్రయంతో పాటు అన్నప్రసాద వితరణ కూడా రద్దు చేస్తారు. 
 
శ్రీవారి ఆలయం మూసివేస్తున్నందుకు దర్శనం కోసం ఇచ్చే అన్ని రకాల సిఫార్సు లేఖలు కూడా పనిచేయవు. సూర్య గ్రహణం ఘడియలు ముగిసిన తర్వాత ఆలయం తలుపులు తిరిగి తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనం కోసం అనుమతిస్తారు. 
 
ఇదిలావుంటే, భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణం 27 యేళ్ల తర్వాత ఏర్పడనుంది. వచ్చే 2025లో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపించనున్నప్పటికీ అది భారత్‍‌లో కనిపించే అవకాశం లేదు. భారత్‌లో మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం వీక్షించాలంటే వచ్చే 2032 వరకు వేచి వుండాల్సి వుంది. మరోవైపు, హైదరాబాద్ నగరంలో ఈ సూర్యగ్రహణం సాయంత్రం 4.59 గంటలకు కనిపించనుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments