24న ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు విడుదల

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (21:00 IST)
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర్ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే తమ ఈతి బాధలన్నీ తొలగిపోతాయని ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడి ప్రగాఢ విశ్వాసం. అయితే, శ్రీవారి దర్శనం అంత సులంభంకాదు. సర్వదర్శనం క్యూ లైన్లలో వెళ్లితే కనీసం 24 గంటల పాటైనా వేచివుండాలి. ఇక అర్జిత సేవల టిక్కెట్లు దక్కాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను రిలీజ్ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ప్రకటించింది. అక్టోబరు నెలకు సంబంధించిన ఈ అర్జిత సేవా టిక్కెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. 
 
అదే రోజున మధ్యాహ్నం 2 గంటలకు మరికొన్ని టిక్కెట్లను, లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్టు తెలిపింది. అలాగే, అక్టోబరు నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శనం కోటా టిక్కెట్లను కూడా ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

తర్వాతి కథనం
Show comments