తిరుమలలో పల్లవోత్సవం, 30సంవత్సరాల తరువాత...

Webdunia
గురువారం, 29 జులై 2021 (23:11 IST)
తిరుమలలో పల్లవోత్సవం వేడుకగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టిటిడి పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్ సంస్ధానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.
 
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్ధానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైసూర్ ప్యాలెస్ మహారాణి ప్రమోదాదేవి వడయార్ 30యేళ్ళ తరువాత ఈ పల్లవోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
 
ఎంతో వేడుకగా కార్యక్రమం జరిగింది. అధికసంఖ్యలో భక్తులు పల్లవోత్సవాన్ని తిలకించారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూనే టిటిడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో తిరుమలలో స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

దయచేసి నన్ను విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే వుండండి, ఆపొద్దు: తమిళనాడు సీఎం విజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

తర్వాతి కథనం
Show comments