Webdunia - Bharat's app for daily news and videos

Install App

భక్తుల లేని తిరుమల కొండ ... రూ.కోటి కిందకు పడిపోయిన ఆదాయం

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (09:53 IST)
కరోనా వైరస్ ప్రభావం తిరుమల కొండపై తీవ్రంగా ఉంది. సాధారణ పరిస్థితుల్లో అయితే, తిరుమలో వసంతోత్సవాల సమయంలో భక్తులు కిటకిటలాడుతుంటారు. ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 
 
ఓ వైపు తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు జరుగుతున్నా, భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. కరోనా భయంతో ప్రయాణాలు చేసేందుకు అత్యధికులు ఆసక్తిని చూపించడం లేదు. ఈ ప్రభావం తిరుమలపైనా పడింది.
 
శనివారం నాడు స్వామివారిని 23,998 మంది దర్శించుకోగా, 13,061 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం కూడా భారీగా పడిపోయింది. చాలా కాలం తరువాత హుండీ ఆదాయం రూ. 85 లక్షలకు తగ్గింది. 
 
కరోనా సెకండ్ వేవ్ వల్లనే భక్తుల రద్దీ మందగించిందని, పరిస్థితులు చక్కబడేంత వరకూ టైమ్ స్లాట్ టోకెన్ దర్శనాల కోటాను విడుదల చేసే పరిస్థితి లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Meera Jasmine: నటుడు షైన్ టామ్ చాకో కుటుంబానికి నటి మీరా జాస్మిన్ సంతాపం

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

అన్నీ చూడండి

లేటెస్ట్

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

Washing Hands in Plate? భోజనం చేసిన తర్వాత కంచంలోనే చేతులు కడిగేస్తున్నారా?

02-06-2025 సోమవారం దినఫలితాలు - మీ వాక్కు ఫలిస్తుంది...

తర్వాతి కథనం
Show comments