Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖుల సేవలో తరించిన టిటిడి.. సామాన్య ప్రజలు గాలికి...

వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తిరుమలకు తరలివస్తారు. అలాంటి తిరుమలలో భక్తులకు కనీస సౌకర్యాలను కల్పించాల్సిన టిటిడి చేతులెత్తేసింది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి 5 కిలోమీటర్లకు పైగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వే

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (21:47 IST)
వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తిరుమలకు తరలివస్తారు. అలాంటి తిరుమలలో భక్తులకు కనీస సౌకర్యాలను కల్పించాల్సిన టిటిడి చేతులెత్తేసింది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయి 5 కిలోమీటర్లకు పైగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. 
 
చలికి కూడా లెక్కచేయక భక్తులు రోడ్లపైనే పడిగాపులు కాచారు. నాలుగు మాడవీధుల్లో ఇసుకేస్తే రాలనంత భక్తజనం కనిపించారు. ఎప్పటిలా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశాం.. సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని టిటిడి ఉన్నతాధికారులు ప్రకటనలు చేశారు కానీ అది ఏ మాత్రం సాధ్యం కాలేదు. గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. 
 
మరోవైపు  వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావ్, టిడిపి నేతలు సిఎం రమేష్, తెలంగాణా మంత్రులు, సినీనటులు తదితర ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments