Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు పోటెత్తిన భక్తులు... 8 రాష్ట్రాల నుంచి రాక

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (10:10 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా గత 80 రోజులుగా శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. ఇపుడు అంటే 82 రోజుల తర్వాత శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో గురువారం నాడు 8 రాష్ట్రాల నుంచి భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
గురువారం స్వామిని దర్శించుకున్న భక్తుల్లో 8 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 143, తమిళనాడు 141, కర్ణాటక నుంచి 151 మందితో పాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషాన్నిచ్చిందని భక్తులు తెలిపారు.
 
దీనిపై తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పాటిస్తూ తిరుమల, తిరుపతిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో పని చేసి పక్కా ప్రణాళికతో దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

తర్వాతి కథనం
Show comments