Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పోటెత్తిన భక్తులు, రోడ్లపైకి వచ్చిన భక్తుల క్యూలైన్లు

Webdunia
సోమవారం, 23 మే 2016 (11:31 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత రెండు రోజులుగా ఉన్న రద్దీని పోలిస్తే సోమవారానికి మరింత పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనం వద్ద తితిదే ఏర్పాటు చేసిన క్యూలైన్లు కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. గంటలకు గంటలు రోడ్లపైనే దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు.
 
సోమవారం ఉదయం 5 గంటల నుంచి కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి రెండు కిలోమీటర్లకు క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల పరిస్థితి అదే. అలిపిరి పాదాలమండపం, శ్రీవారి మెట్ల గుండా వందలాదిమంది భక్తులు గోవిందనామస్మరణలు చేసుకుంటూ తిరుమలకు చేరుకుంటున్నారు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల్లోను, కాలినడక భక్తులకు 9 గంటల్లో దర్శనం చేయిస్తామని తితిదే చెబుతోంది. గదులు ఖాళీ లేవు. 
 
ఎక్కడ చూసినా రద్దీ రద్దీ. తలనీలాల వద్ద భక్తులే భక్తులు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు.  విఐపిల తాకిడి కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తితిదే మాత్రం ఎప్పటిలాగే చేతులెత్తేసింది. గదులు లేక భక్తులు రోడ్లపైనే పడిగాపులు. అర్థరాత్రి నుంచి భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలని తితిదే ప్రయత్నం చేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-06-2025 నుంచి 28-06-2025 వరకు వార ఫలితాలు

22-06-2025 ఆదివారం దినఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది....

21-06-2025 శనివారం దినఫలితాలు - బెట్టింగుల జోలికి పోవద్దు....

20-06-2025 శుక్రవారం దినఫలితాలు - మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు...

TTD: అలిపిరి వద్ద తనిఖీల్లో జాప్యం.. ఇకపై అలాంటి ఇబ్బందులకు చెక్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments