Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పోటెత్తిన భక్తులు, రోడ్లపైకి వచ్చిన భక్తుల క్యూలైన్లు

Webdunia
సోమవారం, 23 మే 2016 (11:31 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత రెండు రోజులుగా ఉన్న రద్దీని పోలిస్తే సోమవారానికి మరింత పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనం వద్ద తితిదే ఏర్పాటు చేసిన క్యూలైన్లు కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. గంటలకు గంటలు రోడ్లపైనే దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు.
 
సోమవారం ఉదయం 5 గంటల నుంచి కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి రెండు కిలోమీటర్లకు క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల పరిస్థితి అదే. అలిపిరి పాదాలమండపం, శ్రీవారి మెట్ల గుండా వందలాదిమంది భక్తులు గోవిందనామస్మరణలు చేసుకుంటూ తిరుమలకు చేరుకుంటున్నారు. సర్వదర్శనం భక్తులకు 12 గంటల్లోను, కాలినడక భక్తులకు 9 గంటల్లో దర్శనం చేయిస్తామని తితిదే చెబుతోంది. గదులు ఖాళీ లేవు. 
 
ఎక్కడ చూసినా రద్దీ రద్దీ. తలనీలాల వద్ద భక్తులే భక్తులు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు.  విఐపిల తాకిడి కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తితిదే మాత్రం ఎప్పటిలాగే చేతులెత్తేసింది. గదులు లేక భక్తులు రోడ్లపైనే పడిగాపులు. అర్థరాత్రి నుంచి భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలని తితిదే ప్రయత్నం చేస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకానంద రెడ్డి హత్య కేసు- హంతకుడిని గుర్తించకుండానే దర్యాప్తు పూర్తయ్యిందా?

నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం పనులు- రూ.916 కోట్లు ఆమోదం

సిద్ధం సిద్ధం.. అని అప్పుడు అరిచారు.. ఇప్పుడు రప్పా రప్పా అంటే ఊరుకుంటామా?

Super Six: వైకాపా పాలనను ధృతరాష్ట్ర కౌగిలిగా అభివర్ణించిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాదులో రూ.13.9 కోట్ల విలువైన 13.9 కిలోల హైడ్రోపోనిక్ పట్టివేత

అన్నీ చూడండి

లేటెస్ట్

10-09-2025 బుధవారం ఫలితాలు - కీలక పత్రాలు.. నగదు జాగ్రత్త...

09-09-2025 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం....

కలియుగాది ఎప్పుడు వస్తుంది? ఆ రోజున ఏం చేయాలి?

చంద్రగ్రహణం: శుద్ధి కార్యాల తర్వాత ఏపీ-తెలంగాణల్లో తెరుచుకున్న దేవాలయాలు

08-09-2025 సోమవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments