Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... తలనీలాల విక్రయం ద్వారా రూ.7.96 కోట్ల ఆదాయం

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:12 IST)
వరుసగా సెలవు రోజులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు ప్రకటించిన మొదట్లో పెద్దగా భక్తుల రద్దీ లేకపోయినా ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శుక్రవారం సర్వదర్శనం కోసం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటలకు పైగా దర్శన సమయం పడుతోంది. అలాగే నడకదారి భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 72,279 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.39 లక్షలు వచ్చింది. 
 
కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే కోటాను కోటి భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో తితిదేకు రూ.7.96 లక్షల ఆదాయం గడించింది. తలనీలాలను మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్ల వెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహిస్తారు. 
 
తలనీలాలలో మొదటి రకం 931 అంగుళాలపైన, రెండో రకం 16 నుంచి 30 అంగుళాలు, మూడో రకం 10 నుంచి 15 అంగుళాలు, నాలుగో రకం 5 నుంచి 9 అంగుళాలు, ఐదో రకం ఐదు అంగుళాలు కన్నా తక్కువ తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

తర్వాతి కథనం
Show comments