Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... తలనీలాల విక్రయం ద్వారా రూ.7.96 కోట్ల ఆదాయం

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:12 IST)
వరుసగా సెలవు రోజులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు ప్రకటించిన మొదట్లో పెద్దగా భక్తుల రద్దీ లేకపోయినా ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శుక్రవారం సర్వదర్శనం కోసం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 5 గంటలకు పైగా దర్శన సమయం పడుతోంది. అలాగే నడకదారి భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 72,279 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.39 లక్షలు వచ్చింది. 
 
కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే కోటాను కోటి భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో తితిదేకు రూ.7.96 లక్షల ఆదాయం గడించింది. తలనీలాలను మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్ల వెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహిస్తారు. 
 
తలనీలాలలో మొదటి రకం 931 అంగుళాలపైన, రెండో రకం 16 నుంచి 30 అంగుళాలు, మూడో రకం 10 నుంచి 15 అంగుళాలు, నాలుగో రకం 5 నుంచి 9 అంగుళాలు, ఐదో రకం ఐదు అంగుళాలు కన్నా తక్కువ తెల్లవెంట్రుకల రకాలను తితిదే ఈ-వేలంలో పెట్టింది.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

తర్వాతి కథనం
Show comments