Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:07 IST)
తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను ఈనెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తితిదే సిద్ధమైంది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల కళ్యాణ వేడుకలను పురస్కరించుకుని ప్రతియేటా పరిణయోత్సవాలను తితిదే నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీ మలయప్పస్వామి గజవాహనంపై, రెండోరోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడవాహనంపై ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి ఊరేగింపుగా వేంచేస్తారు.
 
శ్రీవారిని అనుసరిస్తూ శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల బంగారు పల్లకీపై చేరుకుంటారు. అనంతరం కన్నుల పండువగా, శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు పరిణయోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడురోజుల పాటు శ్రీవారికి తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్త్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తితిదే నిర్వహించనుంది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments