Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:07 IST)
తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను ఈనెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తితిదే సిద్ధమైంది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల కళ్యాణ వేడుకలను పురస్కరించుకుని ప్రతియేటా పరిణయోత్సవాలను తితిదే నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీ మలయప్పస్వామి గజవాహనంపై, రెండోరోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడవాహనంపై ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి ఊరేగింపుగా వేంచేస్తారు.
 
శ్రీవారిని అనుసరిస్తూ శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల బంగారు పల్లకీపై చేరుకుంటారు. అనంతరం కన్నుల పండువగా, శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు పరిణయోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడురోజుల పాటు శ్రీవారికి తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్త్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తితిదే నిర్వహించనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

తర్వాతి కథనం
Show comments