Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:07 IST)
తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను ఈనెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తితిదే సిద్ధమైంది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల కళ్యాణ వేడుకలను పురస్కరించుకుని ప్రతియేటా పరిణయోత్సవాలను తితిదే నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీ మలయప్పస్వామి గజవాహనంపై, రెండోరోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడవాహనంపై ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ మండపానికి ఊరేగింపుగా వేంచేస్తారు.
 
శ్రీవారిని అనుసరిస్తూ శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల బంగారు పల్లకీపై చేరుకుంటారు. అనంతరం కన్నుల పండువగా, శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు పరిణయోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడురోజుల పాటు శ్రీవారికి తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్త్రదీపాలంకరణ సేవలను తితిదే రద్దు చేసింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా తితిదే నిర్వహించనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

తర్వాతి కథనం
Show comments