రద్దీ బాబోయ్.. రద్దీ... తిరుమల క్యూ లైన్లకు తాళాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ రద్దీని నివారించడం తితిదే అధికారులకు సాధ్యపడటం లేదు. ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ..

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (12:27 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ రద్దీని నివారించడం తితిదే అధికారులకు సాధ్యపడటం లేదు. ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. రద్దీని క్రమబద్ధీకరించడం అసాధ్యంగా మారుతోంది. దీంతో క్యూలైన్లకు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నాలుగు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో తొలి రోజే తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఉదయం 8 గంటల సమయానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్టుమెంట్లూ నిండిపోగా, ఆపై గంట వ్యవధిలోనే భక్తుల క్యూ లైన్ 2 కిలోమీటర్లకు పైగా పెరిగిపోయింది. దీంతో భక్తుల రద్దీని తట్టుకోవడం క్లిష్టతరం కావడంతో టీటీడీ సిబ్బంది క్యూ లైన్లకు తాళాలు వేశారు. 
 
మరోవైపు వేలాది మంది తాళాలు వేసిన ప్రాంతాల్లో తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. ఇంకోవైపు కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే నేటి 20 వేల టికెట్ల కోటా కూడా పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మరోపక్క వర్షం కూడా పడుతూ ఉండటంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లతో పాటు పలు ప్రాంతాల్లో అన్న ప్రసాదాలను అందిస్తున్నారు. ఈ రద్దీ మంగళవారం వరకూ కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్చి 3వ తేదీన శ్రీవారి ఆలయం మూసివేత - ఎందుకో తెలుసా?

బైకుపై అతివేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు, రెండు ముక్కలైంది, వీడియో

గతంలో పొరపాటున స్టే ఇచ్చాం.. దాన్ని శ్రీలక్ష్మి ఎంజాయ్ చేశారు : సుప్రీంకోర్టు

ఏడేళ్ల బాలికపై అత్యాచారం? హత్య- మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కేసాడు

నాకు ముఖ్యమంత్రి అవ్వాలని వుంది: మల్లారెడ్డి కోరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

తర్వాతి కథనం
Show comments