Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల భక్తుల రద్దీ రద్దీ... కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్

Webdunia
శనివారం, 21 మే 2016 (12:38 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. భక్తులతో తిరుమల గిరులు మొత్తం కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులే..భక్తులు. దర్శన కంపార్టుమెంట్ల నుంచి గదులు, తలనీలాలు ఇచ్చే ప్రతి ప్రాంతంలోనే భక్తులు కనిపిస్తున్నారు. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సర్వదర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 
 
కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి 5 గంటల్లో దర్శనం కల్పిస్తామని తితిదే చెబుతోంది. అయితే సర్వదర్శనం కంపార్టుమెంట్లలోని భక్తులకు 12 గంటల్లోగా దర్శనం కల్పిస్తామని తితిదే చెబుతోంది. అయితే అంతకుమించి సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 
భక్తులు గదులు దొరక్క రోడ్లపైనే సేదతీరుతున్నారు. సీఆర్‌ ఓ కార్యాలయం, ఎంబిసి-34, పద్మావతి విచారణ కార్యాలయాన్నింటిను గదుల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. శనివారం శ్రీవారిని 75,148 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2 కోట్ల 14 లక్షల రూపాయలు లభించింది.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments