తిరుచానూరులో త్వ‌ర‌లో ఆన్‌లైన్‌ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (20:55 IST)
కరోనా కారణంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా పలు సేవలు నిలిచిపోయాయి. కానీ ప్రస్తుతం యథావిధిగా భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటంతో ఆన్‌లైన్ సేవలను ప్రారంభించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుమలలో ఆన్లైన్ వర్చువల్ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న టిటిడి తిరుచానూరులో కూడా చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో  తిరుమల శ్రీవారి ఆల‌యం త‌ర‌హాలో తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో త్వ‌ర‌లో ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. ఈ టికెట్ ధ‌ర‌ను రూ.500/-గా నిర్ణ‌యించారు. 
 
గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్ల‌ను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా క‌ల్యాణోత్స‌వాన్ని వీక్షించ‌వ‌చ్చు. ఆ త‌రువాత 90 రోజుల్లోపు గృహ‌స్తులు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్‌లో ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అక్షింత‌లు ప్ర‌సాదంగా అందిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు.. యూపీలో కుల ప్రస్తావన ఇక వుండదు..

Naga Babu: అసెంబ్లీలో నాగబాబు తొలి ప్రసంగం.. ఎక్కడా వైకాపా పేరెత్తలేదు.. (video)

ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీకి వచ్చి బాత్రూమ్‌లో ప్రసవం.. బిడ్డను బక్కెట్‌లో వదిలి...

నిద్రలోనే కాటేసిన మృత్యువు... భారీ వర్షానికి పాత ఇంటి గోడ కూలి...

యువకుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య - బాత్రూమ్‌లో చీరతో ఉరి

అన్నీ చూడండి

లేటెస్ట్

21-08-2025 ఆదివారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

21-09-2025 నుంచి 27-09-2025 వరకు మీ వార రాశిఫలితాల

మహాలయ అమావాస్య నాడు ఇవి దానం చేస్తే పితృ దేవతలు సంతృప్తి

Mahahlaya Amavasya 2025: మహాలయ అమావాస్య రోజున గుమ్మడిని ఎవరికి దానంగా ఇవ్వాలి?

బాపట్ల మీదుగా తిరుపతి చేరుకున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కుళ్లిపోయిన కుక్కను చూపించి...

తర్వాతి కథనం
Show comments