Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజాకవిత్వం ద్వారా శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసిన వెంగమాంబ : తితిదే ప్రాజెక్టు ప్రత్యేకాధికారి

Webdunia
శనివారం, 21 మే 2016 (12:26 IST)
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులను సైతం అర్థం చేసుకునే ప్రజా కవిత్వం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని వ్యాప్తి చేశారని తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్‌.ముక్తేశ్వరరావు నొక్కివక్కాణించారు. సంకీర్తనల్లోని భావాన్ని ప్రజల బాణీలోనే తెలియజేసిన ఘనత అన్నమయ్య, వెంగమాంబకు దక్కిందన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలోని శుక్రవారం తరిగొండ వెంగమాంబ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముక్తేశ్వరరావు ప్రసంగిస్తూ తాళ్లపాక అన్నమయ్య తర్వాత ఆ స్థాయిలో వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకింతం చేశారని తెలిపారు. ఈమె వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు.
 
మనసులో పెట్టి వింటే వెంగమాంబ కీర్తనల్లోని పరమార్థం తెలుసుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ జయంతిని పురస్కరించుకుని తితిదే ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ గరిమెళ్ళ బాలక్రిష్ణప్రసాద్‌ స్వరపరిచి గానం చేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గీత మణిమాల, వెంగమాంబ జీవిత చరిత్రను హరికథా రూపంలో శ్రీమతి జయంతీ సావిత్రి గానం చేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (హరికథ)సిడిలను ముక్తేశ్వరరావు ఆవిష్కరించారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

తర్వాతి కథనం
Show comments