Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్సీఎస్టీ - మత్స్యకారుల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు : తితిదే ఈవో సాంబశివరావు

Webdunia
మంగళవారం, 7 జూన్ 2016 (11:53 IST)
ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించనున్నట్టు తితిదే ఈవో సాంబశివరావు వెల్లడించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అర్చక శిక్షణపై అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏజెన్సీలు, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాల్లో ఉత్సాహవంతులైన యువకులను ఎంపిక చేసి అర్చక శిక్షణ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నట్టు తెలిపారు.
 
ఈ సామాజికవర్గం ప్రజలు నివశించే ప్రాంతాల్లో ఒక్కో ఆలయాన్ని 8 లక్షల రూపాయల వ్యయంతో 500 ఆలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఆయా ఆలయాల పరిధిలో స్థానికంగా ఉన్న షెడ్యూల్డ్ కులాల వారు, గిరిజనులు, మత్స్యకారులను గుర్తించి వారికి సులభంగా అర్థమయ్యేలా శాస్త్రీయ పద్దతుల్లో అర్చక శిక్షణ ఇవ్వాలని సూచించారు. 
 
ఇందుకోసం ప్రముఖ పండితుల సలహాలు తీసుకోవాలని కోరారు. శిక్షణ అనంతరం ఆయా ఆలయాల్లో వీరికి అర్చకులుగా నియమించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అర్చక శిక్షణ కోసం పాఠ్యాశాల రూపకల్పన, ఆయా ఆలయాలకు అవసరమైన అర్చకుల ఎంపిక కోసం తిరుపతి జేఈఓ  ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్చక శిక్షణ కార్యక్రమాలను తితిదే శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆదేశించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

27-02- 2025 గురువారం దినఫలితాలు - పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Maha Shivratri 2025: శివుడికి పసుపు ఆవాలు సమర్పిస్తే.. ఏం జరుగుతుంది?

తెలుగు రాష్ట్రాలలో మహా శివరాత్రి వేడుకలు- ప్రయాగ్‌రాజ్‌లో ఇసుక రాలనంత జనం (video)

26-02-2025 బుధవారం దినఫలితాలు - ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి.

పెన్సిల్‌పై అద్భుతం.. పెన్సిల్ మొనపై శివుని రూపం.. 1008 కిలోలతో బూందీతో శివలింగం

తర్వాతి కథనం
Show comments