Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల దర్శనం 2 గంటల్లోనే.. శ్రీవారి సేవలో ప్రముఖులు

Webdunia
మంగళవారం, 7 జూన్ 2016 (11:48 IST)
గత పది రోజులుగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది. సర్వదర్శనం కేవలం 2 గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. శని, ఆది, సోమవారాలలో రద్దీ మోస్తారుగా కనిపించినా మంగళవారం ఉదయానికి ఖాళీ అయిపోయింది. మంగళవారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శనం 2 గంటల్లోనే లభిస్తోంది. అలాగే కాలినడక భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా రెండుగంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. 
 
పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కావడంతో భక్తుల రద్దీ తగ్గినట్లు తితిదే అధికారులు చెపుతున్నారు. రేపటికి తిరుమలలో భక్తుల రద్దీ మరింత తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. సోమవారం శ్రీవారిని 82,347 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 3 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలైంది. 
 
మరోవైపు.. మంగళవారం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపి రాయపాటితో పాటు తెలంగాణ ప్రాంతానికి శాసనసభ్యురాలు కొండా సురేఖలు విఐపి విరామ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

11-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అంచనాలను మించుతాయి...

09-07-2025 గురువారం దినఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...

Guru Purnima 2025: గురు పౌర్ణమి- ఇంద్రయోగం.. మిథునం- కన్యాతో పాటు ఆ రాశులకు శుభం

తర్వాతి కథనం
Show comments