Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల దర్శనం 2 గంటల్లోనే.. శ్రీవారి సేవలో ప్రముఖులు

Webdunia
మంగళవారం, 7 జూన్ 2016 (11:48 IST)
గత పది రోజులుగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది. సర్వదర్శనం కేవలం 2 గంటల్లోనే భక్తులకు లభిస్తోంది. శని, ఆది, సోమవారాలలో రద్దీ మోస్తారుగా కనిపించినా మంగళవారం ఉదయానికి ఖాళీ అయిపోయింది. మంగళవారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శనం 2 గంటల్లోనే లభిస్తోంది. అలాగే కాలినడక భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా రెండుగంటల్లోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. 
 
పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కావడంతో భక్తుల రద్దీ తగ్గినట్లు తితిదే అధికారులు చెపుతున్నారు. రేపటికి తిరుమలలో భక్తుల రద్దీ మరింత తగ్గే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. సోమవారం శ్రీవారిని 82,347 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 3 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలైంది. 
 
మరోవైపు.. మంగళవారం శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపి రాయపాటితో పాటు తెలంగాణ ప్రాంతానికి శాసనసభ్యురాలు కొండా సురేఖలు విఐపి విరామ దర్శన సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Teenar Mallanna: తీన్మార్ మల్లన్నకు పెద్ద షాక్: పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మోటారు వాహన చట్టం- ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

GV Reddy: బడ్జెట్ అదుర్స్.. 2029లో మళ్ళీ బాబు ముఖ్యమంత్రి కావాలి: జీవీ రెడ్డి

Vijay as Pawan: పవన్‌లా వుండిపో.. పీకే సూచన.. పళని సీఎం అయితే విజయ్‌ డిప్యూటీ సీఎం?

బైకుకు ముందొకరు, వెనుకొకరు.. మందేసి బైకుపై నిల్చుని.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ యువతి హంగామా.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

27-02- 2025 గురువారం దినఫలితాలు - పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Maha Shivratri 2025: శివుడికి పసుపు ఆవాలు సమర్పిస్తే.. ఏం జరుగుతుంది?

తెలుగు రాష్ట్రాలలో మహా శివరాత్రి వేడుకలు- ప్రయాగ్‌రాజ్‌లో ఇసుక రాలనంత జనం (video)

26-02-2025 బుధవారం దినఫలితాలు - ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి.

పెన్సిల్‌పై అద్భుతం.. పెన్సిల్ మొనపై శివుని రూపం.. 1008 కిలోలతో బూందీతో శివలింగం

తర్వాతి కథనం
Show comments