Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 లక్షలతో మహిళా విశ్వవిద్యాలయంలో శ్రీవారి ఆలయం: టిటిడి ఛైర్మన్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:37 IST)
తిరుపతిలో మహిళలకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు అయ్యిందంటే అది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దయేనన్నారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన కెల్ రావు భవనాన్ని, ఆడిటోరియం, లైవ్లీ హుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్, మెడిసినల్ ప్లాంట్ పార్కులను టిటిడి ఛైర్మన్ ప్రారంభించారు. 

 
ఈ సంధర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, మహిళా విశ్వవిద్యాలయం అభివృద్థికి టిటిడి ఇతోధిక సహాయం అందిస్తోందన్నారు. ఇప్పటికే మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణానికి టిటిడి 130 ఎకరాల భూమిని ఇచ్చిందని చెప్పారు. దీంతో పాటు ఏటా కోటి రూపాయల గ్రాంట్‌ను కూడా అందిస్తోందన్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మిస్తున్నామని.. త్వరలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు టిటిడి ఛైర్మన్.

 
సృష్టికి మూలం స్త్రీ అని, స్త్రీ లేకుండా సమాజం లేదన్నారు. సంపూర్ణ ప్రేమ తత్వంలో ఆమె శక్తిగా అవతరించిందన్నారు. అలాంటి స్త్రీ మూర్తులందరికీ సంపూర్ణంగా నిండుగా విద్యను అందిస్తూ సమాజ ఉన్నతికి తోడ్పడుతోంది పద్మావతి మహిళా విశ్వవిద్యాలయమన్నారు. ఎంతోమంది విద్యార్థినులను ఉన్నత చదువులను చదివించిన ఘనత పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానిదేనన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments