భద్రాచలంలో శ్రీరామనవమి.. అక్షింతలకు 300 క్వింటాళ్ల బియ్యం

సెల్వి
మంగళవారం, 26 మార్చి 2024 (11:51 IST)
భద్రాచలం జిల్లా శ్రీ సీతారామ స్వామి ఆలయంలో శ్రీరామనవమికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. భక్తులు ముఖ్యంగా మహిళలు వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొని ప్రార్థనలు, రంగులతో పండుగ శోభను సంతరించుకున్నారు. 
 
రోజంతా ఉత్సవాల సందర్భంగా, అర్చకులు ఉత్తరద్వారం వద్ద 'కలశ పూజ' వంటి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తరువాత వివిధ శుభ పదార్థాలను ఉపయోగించి తలంబ్రాలు తయారు చేశారు. ఈ ఏడాది అక్షింతలకు సుమారు 300 క్వింటాళ్ల బియ్యాన్ని వినియోగించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్‌.రమాదేవి తెలిపారు. 
 
ఈ వేడుకల్లో నిత్య కల్యాణం మండపంలో ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి, స్తోత్రాలతో పాటు దేవతామూర్తులకు నైవేద్యాలు నిర్వహించారు. డోలోత్సవంలో శ్రీరాముడిని పెళ్లికొడుకుగా అలంకరించి, సాయంత్రం తిరువీధిసేవ, శ్రీలక్ష్మీ పూజలు నిర్వహించగా, పలువురు మహిళా భక్తులు చురుగ్గా పాల్గొన్నారు. ఇంకా సీతారాముల కల్యాణోత్సవం, పట్టాభిషేకం ఏప్రిల్ 17, 18 తేదీలలో జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

Diwali 2025: దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం.. ఇంకా గజకేసరి యోగం కూడా..!

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

తర్వాతి కథనం
Show comments