Webdunia - Bharat's app for daily news and videos

Install App

20న ప్రత్యేక దర్శన టిక్కెట్ల కోటా విడుదల : తితిదే

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (07:32 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను శనివారం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను శనివారం ఉదయం 9 గంటలకు వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. 
 
రోజుకు 25 వేల టికెట్ల చొప్పున నెల రోజుల కోటా అధికారులు విడుదల చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం తర్వాత తిరుమలతో పాటు తిరుపతిలోని టీటీడీ అద్దె గదుల కోటాను రిలీజ్‌ చేయనుంది. భక్తులు విషయాన్ని గమనించి వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో భక్తులు తప్పనిసరిగా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేసింది. 
 
మరోవైపు, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.21 కోట్లు లభించినట్టు టీటీడీ ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న 50,476 మంది భక్తులు సమర్పించిన కానుకలతో పాటు నిల్వ ఉన్న నాణేలను కూడా గురువారం లెక్కించగా రూ.5.21 కోట్ల ఆదాయం లభించింది. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments