Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్నకు రూ. 1,11,11,111 విరాళం.. ఇచ్చిందెవరో తెలుసా?

జియోతో టెలికాం రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాత జియోఫోన్ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను కూడా విడుదల చేసింది. దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (11:29 IST)
జియోతో టెలికాం రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాత జియోఫోన్ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను కూడా విడుదల చేసింది. దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రిలయన్స్ జియో.. కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ శ్రీవారికి భారీ కానుకలిచ్చుకున్నారు. 
 
మరోసారి తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని వెంకన్నకు విరాళంగా ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ఈ విరాళాన్ని అందించి, ప్రాణాపాయంలో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడాలని ముఖేష్ అంబానీ కోరారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధి ఒకరిని తిరుమలకు పంపించి, విరాళాన్ని అందించారు. 
 
తిరుమలలోని దాతల విభాగంలో ఈ విరాళం చెక్కును అధికారులు స్వీకరించారు. గతంలోనూ ముఖేష్ అంబానీ పలుమార్లు వెంకటేశ్వరునికి కోట్లాది రూపాయలను విరాళంగా సమర్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

29-08-2025 శుక్రవారం ఫలితాలు - ఆప్తుల చొరవతో సమస్య పరిష్కారం....

Sankata Nasana Ganesha Stotram: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని రోజూ పఠిస్తే..?

28-08-2025 గురువారం రాశిఫలాలు - ఎదుటివారి అంతర్యం గ్రహించండి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments