Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్నకు రూ. 1,11,11,111 విరాళం.. ఇచ్చిందెవరో తెలుసా?

జియోతో టెలికాం రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాత జియోఫోన్ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను కూడా విడుదల చేసింది. దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (11:29 IST)
జియోతో టెలికాం రంగంలో పెను మార్పు తీసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆ తర్వాత జియోఫోన్ పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను కూడా విడుదల చేసింది. దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రిలయన్స్ జియో.. కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ శ్రీవారికి భారీ కానుకలిచ్చుకున్నారు. 
 
మరోసారి తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై తనకున్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆయన రూ. 1,11,11,111 మొత్తాన్ని వెంకన్నకు విరాళంగా ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ఈ విరాళాన్ని అందించి, ప్రాణాపాయంలో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడాలని ముఖేష్ అంబానీ కోరారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధి ఒకరిని తిరుమలకు పంపించి, విరాళాన్ని అందించారు. 
 
తిరుమలలోని దాతల విభాగంలో ఈ విరాళం చెక్కును అధికారులు స్వీకరించారు. గతంలోనూ ముఖేష్ అంబానీ పలుమార్లు వెంకటేశ్వరునికి కోట్లాది రూపాయలను విరాళంగా సమర్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments