Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు 22 న ఆన్లైన్లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల విడుదల

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (21:39 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈ డి) టోకెన్లు అక్టోబరు 22 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో  విడుదల చేస్తారు.

అయితే డిసెంబరు 8 వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, డిసెంబరు 16వ తేదీ  ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబరు 8 మరియు 16 వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు.

 
నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అక్టోబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబరు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.

 
భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

తర్వాతి కథనం
Show comments