Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి దర్శనం: 2నెలల టోకెన్లు 22వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల

శ్రీవారి దర్శనం: 2నెలల టోకెన్లు 22వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల
, బుధవారం, 20 అక్టోబరు 2021 (21:19 IST)
తిరుమల శ్రీవారి దర్శనానికి గాను నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడి) టోకెన్లను అక్టోబరు 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 
 
నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అక్టోబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే.. తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబరు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.
 
ఇదిలావుంటే.. డిసెంబరు 8 వ తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, డిసెంబరు 16వ తేదీ ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. 
 
ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబరు 8, 16 వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహంలో వధూవరులు పట్టు వస్త్రాలను ఎందుకు ధరిస్తారు?