Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నులపండువగా పుష్పయాగం, జపతర్పణ హోమాలు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (20:04 IST)
కలియుగ వేంకటేశ్వరస్వామి పట్టపురాణి పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా శాస్త్రోక్తంగా పుష్పయాగం, జపతర్పణ హోమాలు జరిగాయి. ఏకాంతంగానే ఈ కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తోంది.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు.  ఉదయాన్నే ఆలయంలోని శ్రీక్రిష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు. టిటిడి పాంచరాత్ర ఆగమ పండితుల పర్యవేక్షణలో బుత్వికులు చతుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవర్తి, హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు.
 
ఇందులో భాగంగా 120మంది కోటి అర్చన, 36మంది హోమం, 12మంది భాష్యం, రామాయణం, భాగవతం, మహాభారతం పారాయణం, 12మంది జపం, 12మంది ఆవుపాలతో తర్పణం నిర్వహిస్తున్నారు.
 
వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించారు. కోవిడ్ కారణంగా ఏకాంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా భక్తుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం గత యేడాది నుంచి కోవిడ్ కారణంగా ఏకాంతంగానే టిటిడి నిర్వహిస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments