Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ‌వారికి వంద కేజీల కూర‌గాయ‌ల అలంక‌ర‌ణ‌

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (20:42 IST)
శాకాంబరిగా చెముడులంక ధనలక్ష్మి అమ్మవారు క‌ళ‌క‌ళ‌లాడిపోతోంది. వంద కేజీల కూరగాయలతో అలంకరణ అంద‌రినీ విశేషంగా ఆక‌ర్షిస్తోంది.
    
తూర్పుగోదావ‌రి జిల్లా లంక‌ గ్రామాల కూడలైన, ఆలమూరు మండలం చెముడులంక జాతీయ రహదారిపై కొలువుదీరి వున్న ధనలక్ష్మి అమ్మవారు శాకాంబరిగా దర్శనం ఇచ్చారు. ఆషాఢ మాసం శుక్రవారం వారం సందర్భంగా ఈ గ్రామ రైతులు సమకూర్చిన వంద కేజీల కూరగాయలతో అమ్మ‌వారిని అలంకరించారు.

ఆలయ ధర్మకర్త ఆ గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో లంకల్లో పండే వంగ, దొండ, బెండ, మిర్చి, టమోటా,బీర,మునగ వంటి కూరగాయలతో అమ్మవారి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ పురోహితుడు ప్రభాకర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. అంతేకాదు చెముడులంక జాతీయ ర‌హ‌దారిపై వెళ్ళే ప్ర‌తి ప్ర‌యాణికుడు అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటున్నారు. శాకాంబ‌రిగా అలంక‌ర‌ణ అద్భుతంగా ఉంద‌ని వేనోళ్ళ పొగ‌డుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments