దుర్గగుడి ఈవోగా సురేశ్‌బాబు బాధ్యతలు

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (14:37 IST)
విజయవాడలోని శ్రీ కనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం నూతన కార్యనిర్వాహణాధికారిగా ఎం.వి సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈవోగా సురేష్ బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆయనకు ఆలయ వేదపండితులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం దివ్యాశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహామండపం ఏడో అంతస్తులో ఉన్న ఈవో కార్యాలయంలో సురేష్ బాబు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గ గుడి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. త్వరలో జరగనున్న దసరా ఉత్సవాలను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు. సురేష్‌ బాబు ఇప్పటివరకు అన్నవరం దేవస్థానం ఈవోగా విధులు నిర్వర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టపగలు నడిరోడ్డుపై మాజీ ప్రియురాలిని పొడిచి చంపేసిన వ్యక్తి.. ఆపై గొంతుకోసుకుని?

నాగుల చవితి వేళ అద్భుతం.. శివలింగానికి ఇరువైపులా నాగుపాములు (video)

వామ్మో మొంథా తుఫాన్, ఏపీలోనే తీరం దాటుతుందట, రెడ్ ఎలర్ట్

Kurnool Bus Accident: డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుంది.. అక్టోబర్ 27 నాటికి పూర్తి

ఎయిర్ పోర్టుకు క్యాబ్‌లో వెళ్లిన స్టూడెంట్.. టోల్ రూట్ దాటవేశాడు.. ఆరు ఆపమన్నందుకు దాడి

అన్నీ చూడండి

లేటెస్ట్

23-10-2025 గురువారం దినఫలాలు - కష్టేఫలి అన్న సత్యాన్ని గుర్తిస్తారు...

దీపం జ్యోతిః పరబ్రహ్మః

Karthika Masam 2025 : కార్తీకమాసం సోమవారాలు, ఉసిరి దీపం తప్పనిసరి.. శివకేశవులను పూజిస్తే?

karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

తర్వాతి కథనం
Show comments