Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ 17న పౌర్ణమి గరుడ సేవ.. భారీ వర్షాలు.. నడక మార్గం మూత

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (20:42 IST)
అక్టోబర్‌ 17న పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నారు. గురువారం పున్నమిని పురస్కరించుకుని రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, దసరా పండగ సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 
 
మరోవైపు గురువారం సాయంత్రం వరకు వచ్చే 36 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు యాత్రికుల భద్రత కోసం నివారణ చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని గోగర్భం సర్కిల్ నుంచి పాపవినాశనం మార్గంలో భక్తుల ప్రవేశాన్ని టీటీడీ ఇప్పటికే మూసివేసింది. అక్టోబరు 17న శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. తుపాను వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నడకదారి పనితీరుపై నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

లేటెస్ట్

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

తర్వాతి కథనం
Show comments