Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో లింగోద్భవ దర్శన భాగ్యం

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (14:27 IST)
ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో వేలాది మంది భక్తులు ముక్కంటీశ్వరున్ని దర్శించుకుంటున్నారు. శివనామస్మరణలతో శ్రీకాళహస్తి మారుమ్రోగుతోంది.

 
వాయులింగ క్షేత్రాల్లో శ్రీకాళహస్తి అతి ముఖ్యమైనది. ప్రతియేటా మహాశివరాత్రి నాడు వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తికి తరలివస్తుంటారు. కరోనా కారణంగా గత ఏడాది ఏకాంతంగానే సేవలు నిర్వహిస్తే ఈ యేడాది స్వామివారి సేవలో సేవలన్నింటినీ భక్తులు తిలకించే అవకాశాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం కల్పించింది.

 
తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఉచితంగా అల్పాహారాన్ని శ్రీకాళహస్తి సిబ్బంది అందజేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఏడు గంటల లోగా స్వామి వారిని కేవలం అరగంటలో గాని భక్తులు దర్శించుకున్నారు. అయితే ఏడు గంటల తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

 
దీంతో రెండు నుంచి మూడు గంటల సమయం భక్తులకు పడుతోంది. మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయాన్ని అందంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత లింగోద్భవ దర్శనం భాగ్యాన్ని భక్తులకు కల్పించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

తర్వాతి కథనం
Show comments