Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడ్డూల్లో జంతుకొవ్వు.. తగ్గేదేలేదంటున్న భక్తులు.. ఊపందుకున్న విక్రయాలు

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (14:19 IST)
తిరుమల పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ చేశారన్న వివాదం ప్రపంచవ్యాప్తంగా భక్తులలో విస్తృత ఆందోళనకు దారితీసింది. అయితే, ఈ ఆందోళనకరమైన విషయాలు ఉన్నప్పటికీ, ప్రసిద్ధి చెందిన శ్రీవారి లడ్డూకి డిమాండ్ తగ్గలేదు కదా పెరిగింది. 
 
లడ్డూల తయారులో జంతుకొవ్వుతూ కూడిన నెయ్యి కలిపి ఉండొచ్చని ల్యాబ్ రిపోర్టులు రావడంతో టీటీడీ వేగంగా స్పందించి లడ్డూల తయారీకి నాణ్యమైన స్వచ్ఛమైన నెయ్యినే వినియోగిస్తున్నామని భక్తులకు భరోసా ఇచ్చింది. ఈ భరోసా భక్తుల్లో విశ్వాసాన్ని నింపిందని, దీంతో లడ్డూ విక్రయాలు తగ్గుముఖం పట్టకుండా పెరిగాయని తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న 3,59,660 లడ్డూలు పంపిణీ చేశారు. 20వ తేదీన 3,17,954 లడ్డూలను భక్తులకు అందజేశారు. 21న 3,67,607 లడ్డూలు విక్రయించారు. ఈ వివాదాలు భక్తులను ఏమాత్రం లడ్డూ కొనడాన్ని ఆపలేదని టీటీడీ తెలిపింది.  
 
లడ్డూల్లో మెరుగైన రుచి, తాజాదనం, స్వచ్ఛమైన నెయ్యి కారణంగా భక్తులు లడ్డూలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రారంభంలో భయాందోళనలు ఉన్నప్పటికీ, శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతపై భక్తులకు విశ్వాసం బలంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

లేటెస్ట్

భక్తులకు త్వరిత దర్శనం కోసం కృత్రిమ మేధస్సు.. అదంతా టోటల్ వేస్టంటోన్న ఎల్వీ

Shravan Somvar: శ్రావణ సోమవారం ఇలా పూజ చేస్తే సర్వం శుభం

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

తర్వాతి కథనం
Show comments