Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడ్డూల్లో జంతుకొవ్వు.. తగ్గేదేలేదంటున్న భక్తులు.. ఊపందుకున్న విక్రయాలు

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (14:19 IST)
తిరుమల పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ చేశారన్న వివాదం ప్రపంచవ్యాప్తంగా భక్తులలో విస్తృత ఆందోళనకు దారితీసింది. అయితే, ఈ ఆందోళనకరమైన విషయాలు ఉన్నప్పటికీ, ప్రసిద్ధి చెందిన శ్రీవారి లడ్డూకి డిమాండ్ తగ్గలేదు కదా పెరిగింది. 
 
లడ్డూల తయారులో జంతుకొవ్వుతూ కూడిన నెయ్యి కలిపి ఉండొచ్చని ల్యాబ్ రిపోర్టులు రావడంతో టీటీడీ వేగంగా స్పందించి లడ్డూల తయారీకి నాణ్యమైన స్వచ్ఛమైన నెయ్యినే వినియోగిస్తున్నామని భక్తులకు భరోసా ఇచ్చింది. ఈ భరోసా భక్తుల్లో విశ్వాసాన్ని నింపిందని, దీంతో లడ్డూ విక్రయాలు తగ్గుముఖం పట్టకుండా పెరిగాయని తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న 3,59,660 లడ్డూలు పంపిణీ చేశారు. 20వ తేదీన 3,17,954 లడ్డూలను భక్తులకు అందజేశారు. 21న 3,67,607 లడ్డూలు విక్రయించారు. ఈ వివాదాలు భక్తులను ఏమాత్రం లడ్డూ కొనడాన్ని ఆపలేదని టీటీడీ తెలిపింది.  
 
లడ్డూల్లో మెరుగైన రుచి, తాజాదనం, స్వచ్ఛమైన నెయ్యి కారణంగా భక్తులు లడ్డూలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రారంభంలో భయాందోళనలు ఉన్నప్పటికీ, శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతపై భక్తులకు విశ్వాసం బలంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడ్డూ కల్తీ.. జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. భద్రత పెంపు

వైకాపాను వీడనున్న మరో రాజ్యసభ సభ్యుడు!

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం : సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

సీఎం చంద్రబాబుది విశిష్టపాలన సోనూసూద్!

రన్నింగ్ గరీభ్ రథ్ రైలులో ప్రత్యక్షమైన పాము.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు! (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

మహాభరణి- యమదీపం.. కాకులకు నల్ల నువ్వులు.. ఆవు నెయ్యి?

21-09-2024 శనివారం దినఫలితాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు..

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు

20-09-2024 శుక్రవారం దినఫలితాలు : విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు...

19-09-2024 గురువారం దినఫలితాలు : ఒక వార్త సంతోషాన్నిస్తుంది...

తర్వాతి కథనం
Show comments