తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:21 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించింది టిటిడి.
 
సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు టిటిడి సిబ్బంది. ఆలయం లోపల జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయాలను శుద్ధి చేస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఆలయంలో తక్కువ సిబ్బందితోనే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. తిరుమంజనం కారణంగా భక్తుల దర్సనాన్ని కాసేపు నిలిపివేశారు. తిరిగి ఉదయం 11.45 గంటల నుంచి సర్వదర్సన భక్తులను దర్సనానికి అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

తర్వాతి కథనం
Show comments