Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Webdunia
మంగళవారం, 17 మే 2016 (15:47 IST)
సిరుల తల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకున అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి కోయిల్‌ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి వస్తువులను నీటితో శుద్ధి చేశారు. 
 
నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మే 19వ తేదీ అంకురార్పణతో వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 
 
ఉత్సవాల్లో భాగంగా మే 21వ తేదీన ఉదయం స్వర్ణ రథోత్సవం కన్నుపండువగా జరుగనుంది. సాయంత్రం 3 గంటల నుంచి 4.30 గంటల మధ్య శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని తితిదే నిర్వహించనుంది. అలాగే రాత్రి 7 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అమ్మవారిని నాలుగు మాడా వీధుల్లో ఊరేగించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

లేటెస్ట్

దుర్గామాత అనుగ్రహం కోసం అఖండ దీపం వెలిగిస్తే..?

04-02- 2025 మంగళవారం దినఫలితాలు : రుణసమస్యలు కొలిక్కివస్తాయి...

రథ సప్తమి: సూర్యునికి ఇలా పూజ.. చిక్కుడు కాయలు, పరమాన్నం...

స్కంధ షష్టి - కుమారస్వామి పూజతో అంతా జయం

సోమవారం వ్రతం విశిష్టత- అర్థనారీశ్వర స్తోత్రం పఠిస్తూ తెల్లని పువ్వులు..

తర్వాతి కథనం
Show comments