Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

సెల్వి
మంగళవారం, 10 జూన్ 2025 (11:36 IST)
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేక ఉత్సవం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో విహరిస్తారు. ఇంకా ఆలయంలో శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 1990లో ప్రవేశపెట్టబడిన జ్యేష్ఠాభిషేకం, ఊరేగింపులు, వేడుకల సమయంలో తరతరాలుగా ఉపయోగించడం వల్ల ఉత్సవ విగ్రహాలను అరిగిపోకుండా రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రోజు, పుణ్యక్షేత్రంలోని సంపంగి ప్రదక్షిణ వద్ద ఉన్న కల్యాణ మండపంలో ప్రత్యేక ఆచారాలు నిర్వహించారు.
 
క్రతువులలో శాంతి హోమం, శతకలశం, నవకలశం స్థాపనలు, కంకణ ప్రతిష్ఠ, తరువాత అర్ఘ్యం, పద్యం, ఆచమనీయం నైవేద్యాలు ఉన్నాయి. అనంతరం శ్రీ సూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నారాయణా అనే వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను స్నపన తిరుమంజనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
 
సాయంత్రం, మలయప్ప స్వామి వజ్రకవచంతో అలంకరించి, నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. ఇంకా ఈ ఉత్సవంలో భాగంగా, దేవతలను మంగళవారం ముత్యాల కవచం, బుధవారం స్వర్ణ కవచంతో అలంకరించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

తర్వాతి కథనం
Show comments