Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

సెల్వి
గురువారం, 26 జూన్ 2025 (18:40 IST)
ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి కానుకల వర్షం కురుస్తూనే వుంటుంది. శ్రీవారి హుండీలో రోజూ లక్షల విలువ చేసే కానుకలు వచ్చి పడుతుంటాయి. తాజాగా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. 
 
ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడుకు అందజేశారు. ఆలయ పట్టణంలోని ఛైర్మన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తోట అందించిన విరాళాన్ని టీటీడీ అధికారులు అభినందించారు. 
 
ఇకపోతే టీటీడీ అనుబంధ ఆలయాలైన నందలూరు, తాళ్లపాకలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నందలూరులో జూలై 5 నుండి 13 వరకు, తాళ్లపాకలో జూలై 6 నుండి 15 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

తల్లికి ఇద్దరు భర్తలు.. పలువురితో సన్నిహిత సంబంధం.. నచ్చకే ప్రియుడితో కలిసి హత్య

వైజాగ్‌లో కాగ్నిజెంట్ కార్యాలయం... థ్యాంక్స్ చెప్పిన మంత్రి నారా లోకేశ్

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా రోగిపై లైంగిక దాడి.. మృతి.. ప్రారంభమైన దర్యాప్తు..

అన్నీ చూడండి

లేటెస్ట్

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

24-06-2025 మంగళవారం దినఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య- జూన్ 25 బుధవారం రోజున ఇలా చేస్తే.. కర్మలు మటాష్

తర్వాతి కథనం
Show comments