దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట తిరుమలలో సందడి చేశారు. అక్కడ దివ్వెల మాధురి లంగావోణీలో రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. పట్టు లంగావోణిలో మురారిలోని "ఎక్కడ.. ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక" అనే పాటకు రీల్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోపై కొందరు నెగటివ్గా కామెంట్స్ చేసినా.. చాలామంది ఆమె లంగా వోణిలో బాగున్నారని కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇద్దరికీ ఇప్పటికే వివాహాలు జరిగినా.. విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విడాకులు రాగానే వివాహం చేసుకుంటామని ప్రకటించారు. ఈ జంట ఇటీవలే హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యింది. భారీ ఎత్తున ఓ బట్టల షాపు కూడా ప్రారంభించారు. అయితే ఈ షాప్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కనిపించడం హాట్ టాపిక్గా మారింది.
ఇటీవల ఈ బట్టల షాపు ఆఫర్స్కు సంబంధించిన రీల్స్లో దివ్వెల మాధురి కనిపించారు. ఈ వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఇంకా ఓ ఇంటర్వ్యూలో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైకాపాలో తమను ఎదగనీయకుండా తొక్కేశారన్నారు.