భక్తులు నమ్మొద్దండి, ఆ దర్సనం పునరుద్ధరించలేదు: టిటిడి

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (15:25 IST)
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్థులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్సనాలను నిలిపివేయడం జరిగింది. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్సనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. 
 
అయితే గత కొన్నిరోజులుగా సామాజిక మాథ్యమాల్లో తిరుమలలో వృద్థులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్సనాలు పునరుద్ధించినట్లు అవాస్తవ సమాచారం ట్రోల్ అవుతోందని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.
 
అనేకమంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చాక ఈ దర్సనాల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడం జరుగుతుందని టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది.
 
అధికారిక ప్రకటన వెలువడే వరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అవాస్తవ సమాచారాన్ని నమ్మవద్దని టిటిడి కోరుతోంది. గత వారంరోజులుగా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు ట్రోల్ అవుతూనే ఉన్నాయి. దీంతో టిటిడి ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Orvakal: ఫార్మాస్యూటికల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోన్న ఓర్వకల్

రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది.. వైద్య విద్యార్థిని మృతి

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిని అవుతా: కల్వకుంట్ల కవిత

Duvvada: బర్త్ డే పార్టీ కేసు: మాధురి బంధువు పార్థసారధికి నోటీసులు

వెస్ట్ బెంగాల్‌లో అధికారంలోకి వస్తాం : నితిన్ నబిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

డిసెంబర్ 13, 2025, శనివారం, కృష్ణపక్ష నవమి: పది రూపాయలు ఖర్చు చేసి.. ఈ దీపాన్ని వెలిగిస్తే..?

Lakshana shastra: మహిళల బొడ్డుతో పాటు ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ వుంటే?

12-12-2025 శుక్రవారం ఫలితాలు - ధనలాభం.. వాహనసౌఖ్యం పొందుతారు...

Double Decker Bus: సింహాచలానికి డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్

Guruvar Vrat: బృహస్పతిని గురువారం పూజిస్తే నవగ్రహ దోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments