తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కారణం ఏమిటో తెలుసా?

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (15:25 IST)
తిరుమల : తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో స్వామి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. వారికి రెండు గంటల సమయంలోపే స్వామి దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. 
 
చలి అధికంగా ఉండటం, సెలవులు లేకపోవడంతోనే రద్దీ తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు గంటన్నర వ్యవధిలోనే దర్శనం అవుతుండగా, ప్రత్యేక, దివ్య దర్శనం భక్తులకూ అంతే సమయం పడుతోంది. అందులో కూడా క్యూ లైన్లలో నడిచి వెళ్లేందుకు పట్టేందుకు పట్టే సమయమే అధికం.
 
ఇక నిన్న స్వామివారిని 73,350 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,709 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 2.91 కోట్లుగా నమోదైంది. కాగా, తిరుమలలో రద్దీ లేదని తెలుసుకున్న స్థానిక వ్యాపారులు, తిరుపతి వాసులు, స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: రైతులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఎలా జరిగిందంటే?

మొంథా తుఫాను- విశాఖపట్నంలో కూరగాయలు, సీఫుడ్స్ ధరలకు రెక్కలు

Azharuddin: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్ధీన్

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

అన్నీ చూడండి

లేటెస్ట్

కోటి సోమవారం అంటే ఏమిటి?

Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు

29-10-2025 బుధవారం దినఫలితాలు -

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

తర్వాతి కథనం
Show comments