Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురావస్తు శాఖ పరిధిలోకి శ్రీవారి ఆలయం... వెనక్కి తగ్గిన కేంద్రం

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ సంకల్పించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై తితిదే ఈవోకు పురావస్తు శాఖ ఒక లేఖ పంపించింది.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (10:53 IST)
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ సంకల్పించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై తితిదే ఈవోకు పురావస్తు శాఖ ఒక లేఖ పంపించింది. శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న అన్ని ఆలయాలను తమకు అప్పగించాలంటూ ఆ లేఖ సారాంశం. అలాగే, తమ శాఖ సిబ్బంది వచ్చినపుడు తితిదే అధికారులు పూర్తిగా సహకరించాలంటూ అందులో పేర్కొంది.
 
అయితే, తితిదేకు కేంద్ర పురావస్తు శాఖ రాసిన లేఖ వ్యవహారం మీడియాకు లీకైన కొన్ని నిమిషాల్లోనే తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పురావస్తు శాఖ… లేఖపై వెనక్కి తగ్గింది. సమాచార లోపంతోనే ఈ లెటర్ పంపామంటూ వివరణ ఇచ్చుకుంది. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేసింది. దీనికి సంబంధించి టీటీడీ ఈవోకు మరో లేఖ పంపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

BJP MP Etela Rajender: రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది

మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

తర్వాతి కథనం
Show comments