Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోనేటి రాయుడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (16:32 IST)
తిరుమల గిరుల్లో వెలసివున్న కోనేటి రాయుడు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. తిరుమల వసంత మండపంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం విష్వక్సేనుడు మాడవీధుల్లో విహరించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల 23 నిమిషాలకు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల కారణంగా 9 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ పొరపాటు కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడి ప్రమాణ స్వీకారం విషయంలో గందరగోళం నెలకొంది. ఒకరికి బదులుగా మరొకరికి అధికారులు సమాచారమివ్వడంతో ఈ గందరగోళం తలెత్తింది. తితిదే సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేశ్ శర్మను ప్రభుత్వం నియమించింది.
 
ఇందుకు సంబంధించిన సమాచారం మాత్రం ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు పంపింది. అజెండాతో పాటు ప్రమాణ పత్రాన్ని ఆయనకు పంపారు. అక్టోబరు 3వ తేదీన రాజేశ్ శర్మ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లుచేశారు. అయితే, టీటీడీ అధికారులను ముంబైకి చెందిన రాజేష్ శర్మ సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

తర్వాతి కథనం
Show comments