43 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర - జూన్ 30 నుంచి ప్రారంభం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:41 IST)
దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్నాథ్ యాత్రను ఈ యేడాది ప్రారంభించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతం తెలిపాయి. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన అమర్నాథ్ ఆలయ బోర్డు మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించాలని నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా ఈ యాత్ర జూన్ 30వ తేదీ నుంచి మొదలవుతుంది. అమర్నాథ్ యాత్రలో ప్రతి యేటా మంచు శివలింగ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ యేడాది అమర్‌నాథ్ యాత్ర తేదీలను ఖరారు చేసింది. జూన్ 30వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. 
 
ఈ యాత్ర 43 రోజుల పాటు కొనసాగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజున యాత్రను ముగిస్తారు. అయితే, ఈ యాత్రను కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని జేకే ఎల్జీ మనోజ్ సిన్హా సారథ్యంలోని అమర్నాథ్ ఆలయ బోర్డు నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్‌కు గట్టిదెబ్బ?

మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

04-04-2026 శనివారం ఫలితాలు.. అదృష్ట యోగమే కలిసివస్తుంది..

03-04-2026 శుక్రవారం ఫలితాలు... అనుకోని సమస్య ఎదురవుతుంది

రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

02-04-2026 గురువారం ఫలితాలు-విశేషమైన కార్యసిద్ధి ఉంది

తర్వాతి కథనం
Show comments