Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి తర్వాత తొలిసారి శ్రీవారి హుండీ ఆదాయం రూ.2 కోట్లు!

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:24 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో మార్చి నెల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం తొలిసారి ఏకంగా రూ.2.34 కోట్ల మేరకు వచ్చిందినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా, కేంద్రం మార్చి మూడో వారంలో లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత, భక్తుల దర్శనాలకు అనుమతించిన టీటీడీ, ఆపై నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనాలు ప్రారంభించింది. ఆపై తొలిదశలో 3 వేల మందికిలోపే దర్శనాలు చేయించారు.
 
ఈ సమయంలో హుండీ ఆదాయం భారీగా పడిపోయి, రూ.50 లక్షల దిగువకు చేరింది. లాక్డౌన్‌కు ముందు రోజు వరకు రూ.3 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక భక్తుల సంఖ్యను అధికారులు క్రమంగా పెంచుతూ వచ్చారు.
 
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి హుండీ ఆదాయం, లాక్డౌన్ తర్వాత రూ.2 కోట్లను దాటింది. ఆదివారం 2.34 కోట్ల హుండీ ఆదాయం లభించిందని, 12 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

23-05-2025 శుక్రవారం దినఫలితాలు - అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు...

22-05-2025 గురువారం దినఫలితాలు - పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది...

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

తర్వాతి కథనం
Show comments