Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి తర్వాత తొలిసారి శ్రీవారి హుండీ ఆదాయం రూ.2 కోట్లు!

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (09:24 IST)
కరోనా లాక్డౌన్ తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో మార్చి నెల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం తొలిసారి ఏకంగా రూ.2.34 కోట్ల మేరకు వచ్చిందినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా, కేంద్రం మార్చి మూడో వారంలో లాక్డౌన్ ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత, భక్తుల దర్శనాలకు అనుమతించిన టీటీడీ, ఆపై నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనాలు ప్రారంభించింది. ఆపై తొలిదశలో 3 వేల మందికిలోపే దర్శనాలు చేయించారు.
 
ఈ సమయంలో హుండీ ఆదాయం భారీగా పడిపోయి, రూ.50 లక్షల దిగువకు చేరింది. లాక్డౌన్‌కు ముందు రోజు వరకు రూ.3 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక భక్తుల సంఖ్యను అధికారులు క్రమంగా పెంచుతూ వచ్చారు.
 
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి హుండీ ఆదాయం, లాక్డౌన్ తర్వాత రూ.2 కోట్లను దాటింది. ఆదివారం 2.34 కోట్ల హుండీ ఆదాయం లభించిందని, 12 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

తర్వాతి కథనం
Show comments