Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వెంకన్నకు స్వర్ణ కిరీటం, పాదపద్మములు

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20గంటలు, టైమ్‌స్లాట్ టో

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (13:16 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. 
 
సోమవారం శ్రీవారిని 75,819 మంది దర్శించుకున్నారు. 29,794 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి రూ.3.08 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని వారు చెప్పారు.
 
మరోవైపు కలియుగ దైవం తిరుమల వేంకటేశునికి ఓ భక్తుడు రూ.28 లక్షల విలువైన స్వర్ణ కిరీటం, రూ. 2 లక్షల విలువైన పాదపద్మములను బహూకరించాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియత్తానికి చెందిన కె.దొరస్వామి దంపతులు శ్రీవారి భక్తులు. 
 
సోమవారం స్వామి వారిని దర్శించుకున్న వీరు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను కలిసి స్వర్ణ కిరీటం, 1600 గ్రాముల బరువుగల రెండు పాదపద్మములను బహూకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments