Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో 15 మంది తితిదే సిబ్బంది మృతి : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (17:36 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. శ్రీవారి సేవకు అంకితమైన సిబ్బంది సైతం ఈ వైరస్ బారినపడి మృత్యువాతపడుతున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 15 మంది ఉద్యోగులు మృతి చెందారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
తిరుమలలో విధులు నిర్వహిస్తున్నందువల్ల వీరు కరోనా బారిన పడలేదని... ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుంటారని, అక్కడే వీరు కరోనా బారిన పడ్డారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో ఉద్యోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తామని చెప్పారు. ఇకపోతే, ఈ వైరస్ బారిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామన్నారు.
 
తితిదే ఉద్యోగుల కోసం బర్డ్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేంద్రియ వ్యవసాయంతో పండించిన బియ్యంతో రేపటి నుంచి శ్రీవారికీ నైవేద్యం పెడుతామని తెలిపారు. భవిష్యతులో అన్నప్రసాదంలో కూడా సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలతో భక్తులకు అన్నప్రసాదం పెట్టేందుకు ప్రయత్నిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ పౌర్ణమి.. శివాలయంలో దీపదానం చేస్తే ఆ బాధల నుంచి విముక్తి?

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Shravana Masam: గురుగ్రహ దోషాలను దూరం చేసే శ్రావణ గురువారం పూజ

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments