Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో 15 మంది తితిదే సిబ్బంది మృతి : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (17:36 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. శ్రీవారి సేవకు అంకితమైన సిబ్బంది సైతం ఈ వైరస్ బారినపడి మృత్యువాతపడుతున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 15 మంది ఉద్యోగులు మృతి చెందారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
తిరుమలలో విధులు నిర్వహిస్తున్నందువల్ల వీరు కరోనా బారిన పడలేదని... ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుంటారని, అక్కడే వీరు కరోనా బారిన పడ్డారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో ఉద్యోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తామని చెప్పారు. ఇకపోతే, ఈ వైరస్ బారిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామన్నారు.
 
తితిదే ఉద్యోగుల కోసం బర్డ్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేంద్రియ వ్యవసాయంతో పండించిన బియ్యంతో రేపటి నుంచి శ్రీవారికీ నైవేద్యం పెడుతామని తెలిపారు. భవిష్యతులో అన్నప్రసాదంలో కూడా సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలతో భక్తులకు అన్నప్రసాదం పెట్టేందుకు ప్రయత్నిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు : ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Jagan: మూడు సంవత్సరాలు ఓపిక పట్టండి, నేను మళ్ళీ సీఎం అవుతాను.. జగన్ (video)

ట్రంప్ ఆంక్షల దెబ్బ: అమెరికాలో గుడివాడ టెక్కీ సూసైడ్

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

తర్వాతి కథనం
Show comments