పద్మనాభ స్వామి ఆలయం మూసివేత... ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (14:03 IST)
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం తాత్కాలికంగా మూతపడింది. దేశ ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ ఈ ఆలయంలోకి కూడా ప్రవేశించింది. అంటే, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు పెరియ‌నంబి స‌హా 12 మంది ఆల‌య సిబ్బందికి క‌రోనా వైరస్ సోకింది. 
 
దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని పాల‌క‌మండ‌లి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. పాలక మండలి నిర్ణయం మేరకు పద్మనాభ స్వామి ఆలయం ఈ నెల 15వ తేదీ వరకు మూసివుంటుంది. అయితే, భ‌క్తుల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉండ‌ద‌ని, త‌క్కువ మంది సిబ్బందితో ఆల‌యంలో రోజువారి పూజా కార్య‌క్ర‌మాలు య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని తెలిపారు.
 
అయితే, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు పెరియ‌నంబి ఆల‌యానాకి వ‌చ్చేవ‌ర‌కు పూజా బాధ్య‌త‌లు చూసుకునేందుకు తంత్రి స‌ర‌న‌నెళ్లూర్ స‌తీష‌న్ నంబూతిరిప్ప‌డు తిరువ‌నంత‌పురం చేరుకున్నాడు. కాగా క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఈ ఏడాది మార్చి 21 నుంచి కేర‌ళ ప‌ద్మ‌నాభస్వామి ఆల‌యాన్ని మూసివేసిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా ఆల‌యాలు తెరిచేందుకు అవ‌కాశం ఇవ్వ‌డంతో గ‌త ఆగ‌స్టు 27న ఆల‌యాన్ని తెరిచారు. ఇప్పుడు సిబ్బందికి క‌రోనా సోక‌డంతో మరోమారు తాత్కాలికంగా మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

20-10-2025 సోమవారం దినఫలాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments