నాగపడగ నీడన ఆ తల్లి మనోహరంగా దర్శనమిస్తూ..?

Webdunia
బుధవారం, 22 మే 2019 (16:27 IST)
చాలా ఆలయాల్లో నాగ దేవతలు విగ్రహమూర్తులుగా కనిపిస్తారు, కొన్ని చోట్ల పుట్టలకు కూడా నాగ పూజలు చేస్తారు. అయితే ఒక నాగుపాము నేరుగా వచ్చి ఒకే ప్రదేశంలో కొన్ని రోజుల పాటు ఉండి అక్కడే ఆవిర్భవించిన క్షేత్రంగా వరాల నాగమ్మ తల్లి క్షేత్రం కనిపిస్తుంది. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో ఉంది. భక్తులకు కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. 
 
కొంత కాలం క్రితం స్వయంగా నాగుపాము వచ్చి తేజస్సును ఆవిష్కరిస్తూ ఎక్కడైతే ఆవిర్భవించిందో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. పచ్చని పంటపొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం వెలుగొందుతోంది. గర్భాలయంలో నాగదేవత రూపం పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ప్రతి మంగళవారం అభిషేకం జరిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 
 
ఈ తల్లిని మనసారా మొక్కితే ఆపదలు గట్టెక్కుతాయి. కష్టాలు దూరం చేస్తుంది, భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సర్పదోషాలు, కుజదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ దేవాలయంలో నాగపడగ నీడన ఆ తల్లి మనోహరంగా దర్శనమిస్తుంది. 
 
ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఘనంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య షష్టి రోజున, నాగపంచమి, నాగులచవితి రోజున అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా తరలివస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

7,096 శునకాలకు కు. ని శస్త్రచికిత్సలతో పాటు వ్యాక్సినేషన్

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments