Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి... ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం మహా పుణ్యం...

ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశినే "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. ఈ నెల 29వ తేదీన (శుక్రవారం) నాడు ఈ పర్వదినం రాబ

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (21:57 IST)
ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశినే "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. ఈ నెల 29వ తేదీన (శుక్రవారం) నాడు ఈ పర్వదినం రాబోతోంది. సూర్యుడు ధనస్సులో ప్రవేశానంతరం మకర సంక్రమణం సంభవించే మధ్య కాలంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజు వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో పాటు భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తాడని హిందూ ధర్మాలు చెబుతున్నాయి. 
 
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందున దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, శివుడు ఈ రోజే హాలాహలాన్ని త్రాగాడని ప్రతీతి. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశం చేసాడని విశ్వాసం ఉంది.
 
మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. తద్వారా భక్తులు ఆ ద్వారం ద్వారా వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు చేస్తుంటారు, మరీ ముఖ్యంగా ఉపవాసం, జాగరణ చేస్తూ దేవదేవుడిని కొలుస్తారు. తిరుమలలో స్వామివారు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు ప్రత్యేక దర్శనాన్ని కలగజేస్తాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments