వైకుంఠ ఏకాదశి... ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం మహా పుణ్యం...

ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశినే "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. ఈ నెల 29వ తేదీన (శుక్రవారం) నాడు ఈ పర్వదినం రాబ

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (21:57 IST)
ఈ నెల 16వ తేదీన ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశినే "వైకుంఠ ఏకాదశి" లేదా "ముక్కోటి ఏకాదశి" అంటారు. ఈ నెల 29వ తేదీన (శుక్రవారం) నాడు ఈ పర్వదినం రాబోతోంది. సూర్యుడు ధనస్సులో ప్రవేశానంతరం మకర సంక్రమణం సంభవించే మధ్య కాలంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజు వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో పాటు భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తాడని హిందూ ధర్మాలు చెబుతున్నాయి. 
 
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశిలతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందున దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని, శివుడు ఈ రోజే హాలాహలాన్ని త్రాగాడని ప్రతీతి. అంతేకాకుండా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశం చేసాడని విశ్వాసం ఉంది.
 
మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. తద్వారా భక్తులు ఆ ద్వారం ద్వారా వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు చేస్తుంటారు, మరీ ముఖ్యంగా ఉపవాసం, జాగరణ చేస్తూ దేవదేవుడిని కొలుస్తారు. తిరుమలలో స్వామివారు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు ప్రత్యేక దర్శనాన్ని కలగజేస్తాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Little Girl: ముళ్లపందితో చిన్నారి స్నేహం.. వీడియో వైరల్

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం- రెండు లారీల ఢీ.. నలుగురు సజీవదహనం

జూలై 1, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది..?

గ్రామీణ భారతదేశంలో వర్షాకాలంలో పెరుగుతున్న పాముకాటును ఎదుర్కోవడానికి బీఎస్వీ 4ఏ వ్యూహం

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కేసు.. సస్పెన్స్ వీడింది.. ఎక్కడున్నారంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

01-07-2026 నుంచి 31-07-2026 వరకు మాస ఫలితాలు - ఈ మాసం నిరాశాజనకం

యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

తర్వాతి కథనం
Show comments