జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం?

Webdunia
ఆదివారం, 31 మే 2020 (09:14 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ లాక్డౌన్ మే 31వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ లాక్డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చింది. అలాగే, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను జూన్ ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో శ్రీవారి ఆలయం కూడా జూన్ 8 తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని భావిస్తోంది. 
 
ఇందుకోస తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా ముఖానికి మాస్కులు ధరించడం, సామాజిక భౌతికదూరం పాటించడంవంటి జాగ్రత్తలన్నీ పాటించేలా చర్యలు తీసుకోనుంది. 
 
ఇదే అంశంపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆలయం ఎపుడు తెరవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమొచ్చేస్తున్నాం ట్రంప్, ఇరాన్ పని పడదాం: నాటో దేశాలు కబురు

నా పోరాటం.. డాడీ.. మోడీ.. చిన్నమోడీపైనే వుంటుంది.. కవిత

పెళ్లికెళ్లి రసగుల్లా తిన్నాడు.. అది గొంతులో ఇరుక్కుపోయింది.. చివరికి?

ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ నాశనం: కట్టెపుల్లలతో వంట చేసే కాలం రావచ్చు

నితిన్ గడ్కరీ ముందు కూర్చున్న ఆర్కే రోజా.. వెనక నిలబడిన తనుజ.. ఎందుకు?

అన్నీ చూడండి

లేటెస్ట్

Chaitra Navaratri: శ్రీరామ నవమితో ముగిసే చైత్ర నవరాత్రులు.. ఉగాది ప్రత్యేకత

18-03-2026 బుధవారం ఫలితాలు - నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది

17-03-2026 మంగళవారం ఫలితాలు: కష్టించినా ఫలితం శూన్యం

18న శ్రీవారి ఆర్జిత సేవా - 24న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

16-03-2026 మీ రాశి ఫలితాలు, అవకాశం చేజారినా మంచికే...

తర్వాతి కథనం
Show comments