తితిదేలో గోపూజ వివాదం.. ఛైర్మన్ చెప్పారు.. ఈవో విస్మరించారు... కారణమేంటి?

తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రతి శుక్రవారం సాయంత్రం గోపూజ నిర్వహిస్తాం. ఈ శుక్రవారం నుంచే దీన్ని ప్రారంభిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రండి. ఈనెల 13వ తేదీ తిరుపతి మాధవంలో తన కార్యాలయంలో

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (14:08 IST)
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రతి శుక్రవారం సాయంత్రం గోపూజ నిర్వహిస్తాం. ఈ శుక్రవారం నుంచే దీన్ని ప్రారంభిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రండి. ఈనెల 13వ తేదీ తిరుపతి మాధవంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి ప్రకటన చేశారు. ఆశ్చర్యం ఏమంటే దీనికి ముందురోజే తిరుమలలో ఈఓ సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించారు. 
 
సూచనప్రాయంగానైనా గోపూజ గురించి ఆయన చెప్పలేదు. ఛైర్మన్‌ మాత్రం ప్రత్యేకంగా గోపూజ గురించి చెప్పారు. ఏదో ఈఓ మరిచిపోయి ఉంటారులే అనుకున్నారు పాత్రికేయులు. శుక్రవారం వచ్చింది.. శ్రీవారి ఆలయం ముందు గోపూజ నిర్వహించలేదు. గోశాలలో నిర్వహించారు. అనంతరం పొద్దుపోయాక గోవులను ఆలయం ముందుకు తీసుకొచ్చి వాటికి ఆహారం అందించారు. 
 
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ గానీ, ఈఓ సాంబశివరరావుగానీ, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తదితరులు ఎవరూ కనిపించలేదు. గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ కోదండరామారావు ఛైర్మన్‌ పిఎస్‌ తదితరులు మాత్రమే కనిపించారు.
 
తితిదే ఏ కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టినా అత్యంత ఘనంగా ప్రారంభిస్తుంది. అలాంటిది గోపూజ మాత్రం చడీచప్పుడు కాకుండా ఎందుకు సాగిపోయింది? గోశాలలో గోపూజ చేయడం మామూలే. కొత్తేమీ లేదు. ఆలయం ఎదుట చేస్తామన్న గోపూజను గోశాలలోనే ఎందుకు కానిచ్చారు. అసలు ఇది తితిదే పాలకమండలి నిర్ణయించిన కార్యక్రమమేనా? శ్రీవారి ఆలయం ఎదుట గోపూజ నిర్వహించడానికి ఆగమ పండితులు ఆశక్తి చూపలేదు. ఛైర్మన్‌ చదలవాడ మాట్లాడేటప్పుడు ఆలయం వద్ద గోపూజ చేయకూడదని అంటున్నారు. గోవు అందరికీ చాలా పవిత్రమైనది. గోవుకు పూజ చేయడం తప్పేమీకాదు. గోపూజ చేస్తామని చెప్పారు. గోపూజలకు సంబంధించి తితిదేలో ఇంత గందరగోళం ఏమిటో అర్థం కాదు. తిరుపతి గోశాలలో గోపూజ నిర్వహిస్తున్నారు.
 
అలిపిరిలో గోపూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల గోశాలలోనూ పూజ జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆలయం ఎదుట నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏమి వచ్చిందో తెలియదు. అంతా ఏకాభిప్రాయానికి వస్తే ఆలయం ఎదుట చేసినా మంచిదే కానీ ఇప్పుడు జరిగిన తీరు చేస్తుంటే అదేదో తితిదేకి సంబంధం లేనిదిగా కనిపిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: కేంద్ర బడ్జెట్‌ పనికిరానిది.. దార్శనికత లేనిది.. నారాయణ

హైదరాబాద్ నుంచి చెన్నైకి 3 గంటల్లో, బెంగళూరుకి 2 గంటల్లో... రైల్లోనే...

ట్రంప్ ఏం నోటితో గ్రీన్ ల్యాండ్ కావాలని అన్నాడో కానీ... అది కాస్తా కరిగిపోతోంది, ముప్పు అంచున ప్రపంచం

చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో ముక్కలు ముక్కలుగా మృతదేహం

జగన్‌ను ఉరికించి తరిమాం, రోజా మా దెబ్బకు పారిపోయింది: జీవన్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

తర్వాతి కథనం
Show comments