Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణుడు రథం దిగగానే భగ్గుమని కాలి బూడిదైంది... (video)

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (23:10 IST)
శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు అన్నీఇన్నీ కావు. ఆ దేవదేవుడు అనునిత్యం ధర్మబద్ధులైన వారిని కాపాడుతూ వుంటారు. భారత యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు హుందాగా కూర్చోగా రథం నగరానికి వచ్చింది.
 
 
కృష్ణుడు అర్జునుడిని ఓరకంట చూస్తూ "దిగు పార్ధా" అన్నాడు. పార్ధుడు మొహం చిట్లించాడు, చికాకుపడ్డాడు. ఆనవాయితి ప్రకారం ముందుగా సారథి దిగి రథం తలుపు తీసాక వీరుడు దిగుతాడు. దానికి విరుద్ధంగా ముందు సారథి దిగకుండా తనను దిగమనడంతో అర్జనుడికి అర్థం కాలేదు. ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక, అర్జునుడు రథం దిగుతాడు.
 
అర్జునుడు దిగి కొంతదూరం నడిచి వెళ్లాక అప్పుడు దిగాడు కృష్ణుడు. మరు నిముషంలోనే రథం భగ్గున మండి బూడిద అయింది. అదిరిపడ్డాడు అర్జునుడు. యుద్ధంలో ఎన్నో దివ్యస్త్రాలు ప్రయోగించబడినవి. వాటిని తన శక్తి ద్వారా అదిమిపట్టి ఉంచాడు కృష్ణుడు. అందుకే ఆయన దిగగానే శక్తి విడుదలై రథం మండిపోయింది. అదే ముందుగా... కృష్ణుడు రథం దిగిఉంటే? అర్థునుడికి అప్పుడు అర్థమైంది శ్రీకృష్ణుని మాటల వెనుక వున్న అర్థం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తర్వాతి కథనం
Show comments