శ్రీరాముడే చంపుతుంటే ఇక ఎవరికి మొరపెట్టుకునేది రామా...

దేహానికి సుఖదుఃఖాలనేవి ఉండనే ఉన్నాయి. భగవత్సాక్షాత్కారం పొందినవాడు తన మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ సమస్తాన్ని భగవంతునికి సమర్పిస్తాడు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు రామలక్ష్మణులు తమ ధనుస్సులను నేలలోకి గుచ్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధన

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:42 IST)
దేహానికి సుఖదుఃఖాలనేవి ఉండనే ఉన్నాయి. భగవత్సాక్షాత్కారం పొందినవాడు తన మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ సమస్తాన్ని భగవంతునికి సమర్పిస్తాడు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు రామలక్ష్మణులు తమ ధనుస్సులను నేలలోకి గుచ్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధనుస్సును తీసి చూసేసరికి దాని కొన రక్తసిక్తమై ఉండటం గమనించాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో తమ్ముడూ... చూడు, చూడు ఏదో ప్రాణి హింసకు గురి అయినట్లుంది అన్నాడు.
 
లక్ష్మణుడు మట్టి తవ్వి చూసేసరికి పెద్ద కప్ప ఒకటి కనిపించింది. అది మరణించే స్థితిలో ఉంది. రాముడు కరుణ పూరిత స్వరంతో నువ్వెందుకు అరవలేదు. మేము నిన్ను కాపాడటానికి ప్రయత్నించి ఉండేవాళ్లం కదా... పాము వాతన పడినప్పుడు నువ్వు బెకబెక మంటావు కదా.. అన్నాడు. అందుకు ఆ కప్ప ఇలా అంది....
 
ఓ రామా..... పాము పట్టుకున్నప్పుడు ఓ రామా... రక్షించు, ఓ రామ రక్షించు... అని కేకలు పెడతాను. అయితే ఇప్పుడు చూడబోతే రాముడే నన్ను చంపుతున్నాడు. అందుకే నేను మౌనం వహించాను అని అంది.
 
- శ్రీరామకృష్ణ పరమహంస

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే : అంబటి సతీమణి పిటిషన్‌పై హైకోర్టు కామెంట్స్

ఆవుపై అత్యాచారం.. వీడియో వైరల్... స్థానికుల విధ్వంసం

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

అన్నీ చూడండి

లేటెస్ట్

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

తర్వాతి కథనం
Show comments