దైవ సన్నిధిలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే అరిష్టమా?

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (13:34 IST)
ఇంట్లో పూజా సమయంలో లేదా ఆలయాలకు తీసుకెళ్లిన కొబ్బరికాయ కొట్టినపుడు కొన్నిసార్లు కుళ్లిపోయి ఉంటుంది. ఇలా జరగడం అరిష్టంగా కొందరు భావిస్తుంటారు. ఇందులో నిజమెంతో ఇపుడు తెలుసుకుందాం. 
 
పూజా సమయం లేదా ఆలయంలో దైవ సన్నిధిలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లి (మురిగి) పోయి, అందులో నీళ్లు లేకుండా ఉంటుంది. దీంతో చాలామంది కంగారుపడిపోతారు. దైవానుగ్రహం కోసం చేసే పూజలో ఇలా అయిందేంటనే భయం వారిని వెంటాడుతుంది. పైగా, ఇలా జరగడం అశుభ సూచకంగా భావిస్తారు. 
 
సాధారణగా కొబ్బరి కాయ కూడా కుళ్ళిపోవడం సహజం. దాన్ని అశుభ సూచకంగా భావించనక్కర్లేదు. ఒకవేళ కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోయి ఉంటే... 'కాయ కుళ్లిపోలేదనీ కుళ్ళు పోయిందనీ' పెద్దలు చమత్కరిస్తుంటారు. అంటే మనకు జరగబోయే కీడు తొలగిపోయిందని అంటారు. కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే కీడు కలుగుతుందనుకోవడం అదొక మానసిక బలహీనతగా భావించాలే తప్ప మరోలా అనుకోకూడదు. 
 
శాస్త్రాలలో, పురాణాలలో ఎక్కడా ఇందుకు ఆధారాలు లభించవు. మనం కొలిచే ఇష్టందైవంపై చలించని నమ్మకం ఉంటే ఇలాంటి సందేహాలు ఉత్పన్నంకావని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోయినా... నీళ్లు లేకపోయినా ఎలాంటి అశుభం జరగదని, నిశ్చింతగా ఉండొచ్చని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

చేవెళ్ల ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి, ముగ్గురు పిల్లలు బయటపడ్డారు...

సారీ డాడీ, ఆమెను వదిలి వుండలేకపోతున్నా, అందుకే మిమ్మల్ని వదలి వెళ్లిపోతున్నా: యువకుడు ఆత్మహత్య లేఖ

కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, దుస్తులు తీసేసి పరార్ అయిన కామాంధులు

శబరిమల అయ్యప్ప భక్తుల కోసం నీలక్కల్‌లో అధునాతన స్పెషాలటీ ఆస్పత్రి

అన్నీ చూడండి

లేటెస్ట్

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

పోలేరమ్మ తల్లిని పిలిచిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి: అందరి ముందుకు వచ్చి నైవేద్యం స్వీకరించిన దేవత

తర్వాతి కథనం
Show comments