అందుకే నేను విభూతి ఇస్తాను: షిర్డి సాయిబాబా

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:15 IST)
శిరిడీలో భక్తులు నివశిస్తున్నప్పుడు సాయిబాబా ఎవరికీ ఊదీ ఇచ్చేవారు కాదు. ఐతే విభూతి ఇస్తున్నప్పుడు మాత్రం ఈ విశ్వమంతా భస్మంలా అశాశ్వతమని గ్రహించండి అని సూచించేవారు. ఆ కట్టెల మాదిరిగానే ఈ శరీరం కూడా. ఈ దేహం పంచభూత నిర్మితం అయిున్నంత వరకూ ఇది వుంటుంది. 
 
ఆయువు తీరగానే ఇది శవమైపోతుంది. కాలి బూడిదవుతుంది. నేనూ, మీరూ అందరం కూడా ఈ స్థితికి చేరుకుంటాం. మీరంతా దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టే నేను విభూతి ఇస్తాను. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య. ఈ అర్థాన్నే విభూతి బోధిస్తూ వుంటుంది. అహర్నిశలు దీనిని స్మరిస్తూ వుండాలి. 
 
ఈ లోకంలో ఎవరికీ ఏమీ కారు. నగ్నంగా వచ్చావు నగ్నంగానే వెళతావు. ఈ సత్యాన్నే ఊదీ తెలియజేస్తుంది. ఈ ఊదీ వివేక పూర్ణ వైరాగ్యాన్ని కలిగి వుండమని సూచిస్తుంది. వీలయినంత ఎక్కువగా దక్షిణ ఇవ్వడం వల్ల మనిషిలో వైరాగ్య లక్షణం వృద్ధి చెందుతుంది. తర్వాత, తర్వాత క్రమంగా అతనికి వైరాగ్యం వంటబడుతుంది. ఒకరికి వైరాగ్యం ఏర్పడినా, అది వివేకయుక్తం కాకపోతే, ఆ వైరాగ్యం వ్యర్థ అవుతుంది. కాబట్టి విభూతిని ఆదరించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్

2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

30-12-2025 మంగళవారం ఫలితాలు - ఆశయసాధనకు ఓర్పుతో శ్రమించండి...

29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...

28-12-2025 నుంచి 03-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - మీనరాశికి ఆదాయం-14

తర్వాతి కథనం
Show comments