Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటా బాధలొస్తాయి తప్పదు...

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (23:26 IST)
షిర్డీ సాయి విశ్వాసం లేనివారిని కూడా కష్టాలలో రక్షించి, భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలోనే భుక్తి, ముక్తి ప్రసాదిస్తారు. మహల్సాపతి బంగారుపని, తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వం చేసేవాడు. సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వము, భిక్ష చేయించారు. అలా సాయిబాబా తన సద్భక్తుని ఉద్ధరిస్తాడు. ఐతే ఎక్కువమందికి అంత స్థిరమైన మనసుండదు.

 
కనుక సాయి వంటి సద్గురు సేవ దొరికినా కొంతకాలమయ్యాక దానిని వదలి ఆయన పట్ల వున్న శ్రద్ధ కోల్పోతారు. సద్గురువు ఎవరినీ వారి శక్తికి మించి ఆత్మపథంలోకి లాగరు. అనివార్యంగా అనుభవించాల్సిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని వాళ్ల పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైన దానినే తమ మందలింపుగా వినియోగిస్తారు.

 
ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవిత సూత్రాలన్నీ సాయి తెలిపారు. పూనాలో 1914లో ప్లేగు వ్యాధి చెలరేగింది. దూబే అనే భక్తుడు భయంతో శిరిడీ వస్తానని మొక్కుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకుని సకుటుంబంగా సాసర్ వాడ్ వెళ్లాడు. అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితో మరణించింది. అతని భార్య కూడా తీవ్రంగా జబ్బు పడింది. నాటి రాత్రి సాయిబాబా దూబెకి స్వప్నదర్శనమిచ్చారు. మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి. లేకుంటే యిలా బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట విభూతి చూచి ఆశ్చర్యపోయాడు. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

తర్వాతి కథనం
Show comments